రాంచీ వన్డేలో ఇషాన్.. 84 బంతుల్లో 93 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 బౌండరీలు, 7 సిక్సర్లున్నాయి. 90లలోకి వచ్చి సెంచరీ మిస్ చేయడం ఇషాన్ కు ఇదేం కొత్తకాదు. ఐపీఎల్ 2020లో కూడా ఆర్సీబీ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ ముంబై బ్యాటర్.. 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. తాజాగా మరో సెంచరీ మిస్ చేసుకున్నాడు.