మూసుకుని వెళ్లి బౌలింగ్ చెయ్ తంబీ... క్రికెటర్ శ్రీశాంత్‌కి ఎమ్మెస్ ధోనీ వార్నింగ్ ఇచ్చిన వేళ....

First Published May 21, 2021, 3:50 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలా కూల్ అండ్ కామ్ పర్సన్... శ్రీశాంత్ చాలా అగ్రెసివ్ ప్లేయర్. శ్రీశాంత్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆవేశంగా అప్పీల్ చేసిన విధానం, వికెట్ తీసిన తర్వాత ఊగిపోతూ సెలబ్రేట్ చేసుకునే విధానం అప్పట్లో యూత్‌లో అతనికి క్రేజ్ పెరగడానికి కారణమయ్యాయి...

సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులోడేల్ స్టెయిన్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన శ్రీశాంత్, ఆ ఆనందాన్ని తట్టుకోలేక బౌలర్ ముందుకెళ్లి డ్యాన్స్ కూడా చేశాడు. ఆ మూమెంట్ ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేరు.
undefined
అలాగే క్రికెటర్ శ్రీశాంత్‌ను మహేంద్ర సింగ్ ధోనీ మందలించిన సంఘటనను బయటపెట్టాడు భారత సీనియర్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప...
undefined
‘2007 టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడాం. హైదరాబాద్‌లో ఆసీస్‌తో వన్డే మ్యాచ్ ఆడుతున్నాం... ఆండ్రూ సైమండ్స్ క్రీజులో ఉన్నాడు...
undefined
బౌలింగ్ వేసేందుకు శ్రీశాంత్ రాగానే... నాన్ స్టైయికింగ్ ఎండ్‌లో ఉన్న ఆండ్రూ సైమండ్స్ సింగిల్ కోసం క్రీజు దాటి బయటికి వచ్చాడు. శ్రీశాంత్ బౌలింగ్ చేయడం ఆపేసి, వికెట్లను గిరాటేశాడు.
undefined
అది మన్కడింగ్. వెంటనే అంపైర్ వైపు తిరిగి... ‘అవుట్ దట్.. అవుట్ దట్’’ అంటూ అప్పీలు చేయడం మొదలెట్టాడు శ్రీశాంత్. వికెట్ కీపింగ్ చేస్తున్న ధోనీ, పరుగెత్తుకుంటూ అతని దగ్గరికొచ్చాడు...
undefined
అవుట్ కోసం అప్పీల్ చేస్తున్న శ్రీశాంత్‌ను ఆపి.. ‘చాలు.. వెళ్లి బౌలింగ్ చెయ్’ అంటూ మందలించాడు... శ్రీశాంత్ ఆవేశాన్ని సరిగ్గా కంట్రోల్ చేయగలడం తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ...’ అంటూ తెలియచేశాడు రాబిన్ ఊతప్ప.
undefined
ఈ సంఘటన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ... సెడ్జింగ్‌కి పాల్పడే ఆసీస్ టీమ్‌కి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు శ్రీశాంత్, గౌతమ్ గంభీర్‌లతో పాటు తనకి ఛార్జ్ ఇచ్చినట్టు తెలిపిన రాబిన్ ఊతప్ప... మిగిలిన ప్లేయర్లు ‘జెంటిల్‌మెన్‌’గా నడుచుకునేవాళ్లని చెప్పాడు.
undefined
ఐపీఎల్‌ 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్టు అంగీకరించిన శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించింది బీసీసీఐ... ఆ తర్వాత అది ఏడేళ్ల నిషేధంగా మారింది.
undefined
2020లో శ్రీశాంత్‌ బ్యాన్ గడువు పూర్తికావడంతో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పాల్గొని సత్తా చాటాడు. మరోవైపు 2015లో చివరిసారిగా టీమిండియాకి ఆడిన రాబిన్ ఊతప్ప, మళ్లీ జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయాడు.
undefined
‘38 ఏళ్ల వయసులో కూడా శ్రీశాంత్ 125 కి.మీ.ల వేగంతో బంతులు విసురుతున్నాడు. అతను ఇదే క్రమశిక్షణతో తన బౌలింగ్‌పైన ఫోకస్ పెడితే, తిరిగి 130 స్పీడ్‌ను అందుకోగలడు. అదే జరిగితే మళ్లీ డేంజరస్ బౌలర్‌గా మారతాడు’ అంటూ శ్రీశాంత్ రీఎంట్రీ గురించి కామెంట్ చేశాడు రాబిన్ ఊతప్ప.
undefined
click me!