మహ్మద్ సిరాజ్, బుమ్రాలపై ‘రేసిజం’ కామెంట్స్... ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ...
First Published Jan 10, 2021, 5:59 AM ISTసిడ్నీ టెస్టులో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. జాతి వివక్షకు కేంద్రమైన ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా ‘రేసిజం’ వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సిడ్నీ క్రికెట్ స్టేడియానికి హాజరైన కొందరు ప్రేక్షకులు... బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై ఇష్టం వచ్చినట్టుగా తిట్టారట.