కృనాల్ పాండ్యాను కలిసిన 8మంది భారత క్రికెటర్లు... పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు...

First Published Jul 27, 2021, 4:30 PM IST

భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, కరోనా పాజిటివ్ బారిన పడిన విషయం తెలిసిందే. కృనాల్‌కి పాజిటివ్ రావడంతో శ్రీలంక, భారత్ మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్‌ను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కృనాల్ పాండ్యాను క్వారంటైన్‌కి తరలించిన అధికారులు, అతనితో సంబంధం ఉన్న 8మంది భారత క్రికెటర్లను గుర్తించారు. వీరిలో ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ కూడా ఉండడం విశేషం.
undefined
ఆవేశ్ ఖాన్, శుబ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ గాయాల బారిన పడడంతో పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లను రిప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ.
undefined
టీ20 సిరీస్ ముగిసిన తర్వాత పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లాల్సి ఉంది. కరోనా బారిన పడిన కృనాల్ పాండ్యాతో వీరిద్దరికీ సంబంధాలు ఉండడంతో, వీరి ఇంగ్లాండ్ ప్రయాణం మరింత ఆలస్యం కానుంది...
undefined
మొదటి టీ20 మ్యాచ్‌లో పాల్గొన్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు మరో 8 మందితో కృనాల్ పాండ్యా కలిసినట్టు తేలడంతో ఈ ప్లేయర్లు లేకుండా రెండో టీ20 మ్యాచ్ నిర్వహించాల్సి ఉంటుంది...
undefined
భారత జట్టులో ప్రస్తుతం 24 మంది ప్లేయర్లు ఉండడంతో కృనాల్ పాండ్యాతో పాటు అతన్ని కలిసిన 8మంది ప్లేయర్లు లేకుండా రెండో టీ20 మ్యాచ్ నిర్వహించాల్సి ఉంటుంది.
undefined
అంతర్జాతీయ ఆరంగ్రేటం కోసం ఆశగా ఎదురుచూస్తున్న దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్... రెండో టీ20 ద్వారా ఎంట్రీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
undefined
ఇప్పటికే లంక బ్యాటింగ్ కోచ్, సహాయక సిబ్బందికి కరోనా సోకడంతో జూలై 13న ప్రారంభం కావాల్సిన వన్డే సిరీస్‌, 18కి వాయిదాపడిన విషయం తెలిసిందే.
undefined
లంక టూర్‌లో తొలిసారి కరోనా పాజిటివ్ రావడం విశేషం. కృనాల్ పాండ్యాను క్వారంటైన్‌కి తరలించిన అధికారులు, మిగిలిన ప్లేయర్లకు కరోనా టెస్టులు నిర్వహించి, నెగిటివ్ వస్తే జూలై 28న రెండో టీ20, షెడ్యూల్ ప్రకారం జూలై 29న మూడో టీ20 మ్యాచ్ నిర్వహిస్తారు.
undefined
click me!