ఇప్పటికే ఐపీఎల్ ముగిసిన తర్వాత నాలుగు సిరీస్ లు కూడా జరుగకముందే టీమిండియాకు నలుగురు సారథులు మారారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కు రిషభ్ పంత్ సారథిగా ఉండగా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో రీషెడ్యూల్డ్ టెస్టుకు బుమ్రా.. టీ20, వన్డేలకు రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ మధ్యలో ఐర్లాండ్ తో జరిగిన రెండు మ్యాచుల టీ20 సిరీస్ కు హార్ధిక్ పాండ్యా సారథిగా పనిచేశాడు.