గత కొన్నాళ్లుగా పామ్ లేమితో తంటాలుపడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో మ్యాచ్ లో తిరిగి టచ్ లోకి వచ్చినట్టే కనిపించాడు. ఆ మ్యాచ్ లో కోహ్లీ చేసింది 35 పరుగులే అయినా అతడు క్రీజులో ఉన్న కొద్దిసేపు మునపటి కోహ్లీ కనిపించాడు. అతడి ఆటతీరు, షాట్ సెలక్షన్ కూడా మారింది.