వెస్టిండీస్ టూర్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ లో టీమిండియా.. ఐర్లాండ్ తో మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ కు బుమ్రా అందుబాటులో ఉండనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 18, 20, 23 తేదీలలో భారత్ - ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ జరగాల్సి ఉంది.