భారత్ - పాక్ క్రికెట్ బోర్డులు ఎట్టుకేలకు ఆసియా కప్ లో ఆడేందుకు ఓ నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టు తాము పాకిస్తాన్ కు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పడంతో సుమారు 9 నెలల పాటు జరిగిన చర్చోపచర్చలు, వాదోపవాదాల తర్వాత పీసీబీ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ప్రకారం ఆగస్టు 31 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో భాగంగా పాక్ లో నాలుగు మ్యాచ్ లు శ్రీలంకలో 9 మ్యాచ్ లు జరుగుతాయి. అయితే ఆసియాకప్ లో హైబ్రిడ్ మోడల్ కు అంగీకారం తెలిపిన తర్వాత పాకిస్తాన్.. భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడేందుకు కూడా అంగీకారం తెలిపిందన్న వార్తలు వచ్చాయి.