ఇదిలాఉండగా.. ఇంగ్లాండ్ తో తొలి వన్డేలో పదివికెట్లు భారత పేసర్లే దక్కించుకున్నారు. ఇలా ఒక మ్యాచ్ లో పేసర్లు పది వికెట్లు దక్కించుకోవడం ఇండియాకు ఇది ఆరోసారి. గతంలో ఆస్ట్రేలియా (1983లో), వెస్టిండీస్ (1983లో), పాకిస్తాన్ (1997లో), దక్షిణాఫ్రికా (2003లో),బంగ్లాదేశ్ (2014లో) లో ఇలా జరిగింది. తాజాగా ఓవల్ లో బుమ్రా 6వికెట్లు తీయగా.. షమీ 3, ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు.