యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీకి ముందు ప్రముఖ కూల్డ్రింక్ కంపెనీ కోసం ఓ యాడ్ చేశాడు...
చిన్నతనం నుంచి జస్ప్రిత్ బుమ్రా షార్ట్ రన్నప్ గురించి, తన బౌలింగ్ యాక్షన్ గురించి సాగుతుందీ యాడ్... ఈ ప్రకటనలో అతని బుమ్రా అమ్మగారి గురించి కూడా ప్రస్తానవ వచ్చింది...
యాడ్ బాగానే ఉంది కానీ టీమిండియా ఫ్యాన్స్ను కలవరబెడుతున్న విషయం ఏంటంటే... టోక్యో ఒలింపిక్స్కి ముందు కూడా ఇలాంటి యాడ్ చేసింది సదరు కూల్డ్రింక్ కంపెనీ...
అప్పుడు ప్రసారమైన యాడ్కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అయితే ఆ యాడ్లో కనిపించిన వారిలో ఒక్క భజరంగ్ పూనియా తప్ప... మిగిలిన అథ్లెట్లు అందరూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు...
కచ్ఛితంగా మెడల్ తెస్తారని భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్కి పయనమైన నెం.1 షూటర్ మను బకర్, సౌరభ్ తివారి, ఆర్చర్ దీపికా కుమారి వంటి వాళ్లు కూడా ఈ యాడ్లో కనిపించారు... టోక్యోలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు...
ఈ యాడ్లో కనిపించి ఏకైక పతకం సాధించిన రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెస్తాడని అనుకుంటే... కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది...
దీంతో బుమ్రా ఫ్యాన్స్లో భయం మొదలైంది. ఇప్పటికే ఐసీసీ నాకౌట్లో బుమ్రా సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వడనే రికార్డు, టీమిండియా ఫ్యాన్స్ను కలవరపెడుతున్న విషయం...
2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వన్డే వరల్డ్కప్ సెమీస్లో పెద్దగా చెప్పుకోదగిన ప్రదర్శన ఇవ్వలేకపోయిన జస్ప్రిత్ బుమ్రా... ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోరంగా విఫలమయ్యాడు...
రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన బుమ్రా ఫెయిల్యూర్, ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణమైంది కూడా...
జస్ప్రిత్ బుమ్రా, డబ్ల్యూటీసీ ఫైనల్లో తన రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చినా... ఆ మ్యాచ్లో అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ వంటి ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చినా పరిస్థితి వేరేగా ఉండేదని విశ్లేషించారు క్రికెట్ పండితులు...
ఇలాంటి సమయాల్లో జస్ప్రిత్ బుమ్రా, ఇలాంటి యాడ్ చేయడం... టీమిండియా ఫ్యాన్స్ను మరింత ఒత్తిడిలో పడేసింది...
యాడ్లో చెప్పినట్టే మనోడి ప్రదర్శన తిరగేసేలా ఉంటుందో, అదిరిపోయే రేంజ్లో ఉంటుందో తెలియాలంటే... టీ20 వరల్డ్కప్లో బుమ్రా పర్ఫామెన్స్ చూసేదాకా వేచి చూడాలి...