జరిగింది ఒకే టెస్టు... రహానేని అప్పుడే మోసేయకండి... మిగిలిన రెండు టెస్టుల్లో...
First Published Jan 1, 2021, 12:47 PM ISTవిరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, మహ్మద్ షమీ వంటి స్టార్లు ప్లేయర్లు దూరమైన భారత జట్టుతో ఆస్ట్రేలియాను ఓడించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు తాత్కాలిక కెప్టెన్ అజింకా రహానే. టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ పూజారా ఫెయిల్ అయినా, టీమిండియాను ముందుండి నడిపించి చారిత్రక విజయాన్ని అందించాడు. దీంతో రహానేపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఒక్క టెస్టుతో అతని కెప్టెన్సీని మెచ్చుకోవడం తొందరపాటు అవుతుందని అంటున్నాడు భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దీప్ దాస్గుప్తా.