షోయబ్ తో పాటు సహచర పాక్ ఆటగాళ్లు, సోషల్ మీడియాలో అభిమానులు తనకు అండగా నిలిచారని అలీ చెప్పాడు. ఆ మ్యాచ్ ముగిశాక నాలుగైదు రోజులకు తనకు తానే సర్ధి చెప్పుకున్నానని, ఆ చేదు ఘటనను మర్చిపోయి ముందుకు సాగాలని నిశ్చయించుకున్నానని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ ముగిశాక బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన హసన్ అలీ.. టెస్టులతో పాటు టీ20లలో కూడా మెరుగ్గా రాణించాడు.