కేవలం సెంచరీలే కాదు, ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ మరిన్ని రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో 8000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ మైలురాయి అత్యంత వేగంగా అందుకున్న భారత ప్లేయర్ గా నిలిచాడు.
ఈ ఘనతను కేఎల్ రాహుల్ కేవలం 224 ఇన్నింగ్స్లో సాధించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 243 ఇన్నింగ్స్లలో 8 వేల పరుగులను అందుకున్నాడు. అంతర్జాతీయంగా చూస్తే కేఎల్ రాహుల్ 8000 పరుగుల మార్కును అత్యంత వేగంగా పూర్తి చేసిన మూడో ఆటగాడు. అతనికి ముందు కేవలం క్రిస్ గేల్ (213 ఇన్నింగ్స్), బాబర్ ఆజం (218 ఇన్నింగ్స్) మాత్రమే ఈ ఘనత సాధించారు.