ధోనీ బ్యాటింగ్‌కి రాగానే 2.5 కోట్లకు, అవుట్ కాగానే 55 లక్షలకు... జియో సినిమాలో మాహీ మ్యాజిక్...

First Published May 24, 2023, 12:15 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మొదటి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో రియల్ టైమ్ వ్యూస్ సరికొత్త రికార్డును తాకింది. గ్రూప్ స్టేజీలో ఆర్‌సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రియల్ టైమ్ వ్యూస్ 2.4 కోట్ల మిలియన్లను తాకింది...

MS Dhoni

మాహీ ఫాలోయింగ్‌కి పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తూ మొదటి క్వాలిఫైయర్‌ మ్యాచ్ సమయంలో జియో సినిమా యాప్‌లో రియల్ టైమ్ వ్యూస్ 2.5 కోట్లను తాకాయి.. అంబటి రాయుడు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ 2 బంతులాడి 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు...

MS Dhoni

ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడి పర్పుల్ క్యాప్ గెలవడమే కాకుండా టీమిండియా తరుపున ఆరంగ్రేటం కూడా చేసిన మోహిత్ శర్మ, పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో మాహీనిపెవిలియన్ చేర్చాడు. మోహిత్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ధోనీ..

Latest Videos


ధోనీ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు అమాంతం 2.5 కోట్లకు చేరిన రియల్ టైం వ్యూస్, మాహీ 2 బంతులు ఆడి అవుట్ కాగానే 55 లక్షలకు పడిపోయింది. మళ్లీ శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా పెరిగి 1.7 కోట్లకు చేరుకుంది రియల్ టైం..

గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించడంతో ఆఖరి ఓవర్లలో కాస్త ఉత్కంఠ రేగింది. ఈ సమయంలో ఇంకా పెరిగి 2.2 కోట్లకు చేరాయి రియల్ టైం వ్యూస్...
 

మే 28న చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ ధోనీకి ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ కావచ్చని ప్రచారం జరుగుతోంది. మాహీ రిటైర్మెంట్ గురించి ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈసారి రియల్ టైమ్ వ్యూస్ 3 కోట్లను తాకుతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్.. 

click me!