ఇండియాకి వాణిజ్య రాజధాని అయిన ముంబై నుంచి చాలామంది మేటి క్రికెటర్లు భారత జట్టులోకి దూసుకొచ్చారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, అజింకా రహానే, రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్... ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. అలాంటి లిస్టులోనే చేరతాడని ప్రణవ్ ధనవాడే పేరు ఏడేళ్ల కిందట బాగా వినిపించింది. కానీ ఆ తర్వాత అతను ఎక్కడా కనిపించలేదు...