యువరాజ్ సింగ్, కుమార సంగక్కర, జయవర్ధనే, గిల్ క్రిస్ట్, డేవిడ్ హస్సీ, బెయిలీ, వీరేంద్ర సెహ్వాగ్, డేవిడ్ మిల్లర్, మురళీ విజయ్, గ్లెన్ మ్యాక్స్వెల్, అశ్విన్, కెఎల్ రాహుల్ లు ఆ జట్టుకు సారథులుగా పని చేశారు. ఇటీవలే కెఎల్ రాహుల్ కూడా లక్నోతో చేరడంతో మయాంక్ అగర్వాల్ ను సారథిగా నియమించుకుంది పంజాబ్. ఆ జట్టుకు అతడు 13 వ సారథి.