ఇదిలాఉంటే మరోవైపు యువ కెప్టెన్లు సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేశారు. భవిష్యత్తు భారత జట్టుకు ఆశాకిరణాలుగా గుర్తింపు పొందిన ఈ ఆటగాళ్లలో పంత్ ఒక్కడే ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో ఉన్నాడు. కాగా, విఫలమైన కెప్టెన్లలో ఇద్దరు, ముగ్గరు వచ్చే ఐపీఎల్ సీజన్ లో కనిపించకపోవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. ఫామ్, వయస్సు సమస్యల రీత్యా వీరిని పక్కనబెట్టే అవకాశమున్నట్టు ఫ్రాంచైజీ ప్రతినిధులు హింట్లు ఇచ్చేశారు.