ఐపీఎల్ 2021లో విచిత్రమైన సంఘటన... 14 ఏళ్ల లీగ్ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే తొలిసారి...

First Published Apr 29, 2021, 7:50 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓ విచిత్రమైన యాదృచ్ఛిక సంఘటన చోటు చేసుకుంది. చెన్నై చెపాక్ స్టేడియం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లో మూడు రోజుల్లో జరిగిన మూడు మ్యాచుల్లో ఒకే స్కోరు నమోదుకావడం విశేషం. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగుల స్కోరు చేసింది...
undefined
ఆర్‌సీబీ విధించిన ఈ లక్ష్యచేధనలో 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 170 పరుగులకి పరిమితమైంది. హెట్మయర్, రిషబ్ పంత్ పోరాడినా ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది ఢిల్లీ క్యాపిటల్స్.
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్... నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సరిగ్గా 171 పరుగుల స్కోరు చేసింది.
undefined
ఫాఫ్ డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్ మొదటి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పడంతో 172 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించంది చెన్నై సూపర్ కింగ్స్...
undefined
రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్... సరిగ్గా 171 పరుగుల స్కోరు చేసింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఒకే స్కోరు నమోదుకావడం విశేషం.
undefined
అంతేకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ రెండూ కూడా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యాయి. రెండు మ్యాచుల్లోనూ 9 బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి లక్ష్యాన్ని చేధించడం మరో విశేషం...
undefined
అదీకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సురేశ్ రైనా ఫోర్ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేయగా, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోలార్డ్ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు...
undefined
click me!