కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భారత క్రికెటర్... అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు నుంచి...

First Published May 29, 2021, 4:19 PM IST

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ 2021) సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సీజన్, తిరిగి సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. దీంతో సీపీఎల్‌ను మరో వారం లేదా 10 రోజులు వాయిదా వేయాల్సిందిగా కోరింది బీసీసీఐ.

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే క్రిస్ గేల్, పోలార్డ్, రస్సెల్ వంటి ప్లేయర్లు, ఐపీఎల్‌లో కూడా భాగంగా ఉండడంతో పాటు ఈ లీగ్‌లో ఆఫ్గాన్, బంగ్లా వంటి దేశాల క్రికెటర్లు కూడా పాల్గొంటారు.
undefined
అయితే ఫారిన్ లీగ్‌లో పాల్గొనే ప్లేయర్లకు ఐపీఎల్‌లో కానీ భారత జట్టు తరుపున ఆడే అవకాశం కానీ ఉండదు. అంతేకాదు దేశవాళీ లీగుల్లో కూడా వారికి చోటు ఉండదు. అయితే ఈ విషయం తెలిసినా భారత ప్లేయర్ స్మిత్ పటేల్, సీపీఎల్ 2021 సీజన్‌లో ఆడబోతున్నాడు.
undefined
ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో 2012లో అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో స్మిత్ పటేల్ సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ సెంచరీ చేయగా, అతనితో కలిసి 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు స్మిత్ పటేల్.
undefined
ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, బరోడా తరుపున దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నాడు. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో కూడా సత్తా చాటాడు. అయితే స్మిత్ పటేల్‌కి ఐపీఎల్‌లో కానీ, భారత జట్టులో కానీ ఇప్పటిదాకా అవకాశం రాలేదు.
undefined
దీంతో విదేశీ లీగుల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నాడు స్మిత్ పటేల్. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు ఆ తర్వాత జరిగే మేజర్ క్రికెట్ లీగ్ (ఎమ్‌ఎల్‌సీ), అమెరికన్ క్రికెట్ లీగ్‌లకు కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు...
undefined
ప్రవీణ్ తాంబే తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనబోతున్న రెండో భారత క్రికెటర్ స్మిత్ పటేల్. 45 ఏళ్ల ప్రవీణ్ తాంబే, కరేబియన్ లీగ్‌లో పాల్గొనడం వల్లే ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడలేకపోయాడు.
undefined
క్రిస్ మోరిస్, పెరేరా, మహ్మద్ అమీర్ వంటి ప్లేయర్లు ఉన్న బార్బోడాస్ ట్రిడెంట్స్ జట్టు తరుపున ఆడబోతున్నాడు స్మిత్ పటేల్. ఈ జట్టులో షై హోప్ కీపర్‌గా ఉండడంతో స్మిత్ పటేల్‌కి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే.
undefined
click me!