విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తిన షోయబ్ అక్తర్

First Published Oct 15, 2019, 12:24 PM IST

న్యూఢిల్లీ: కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన డబుల్ సెంచరీ ద్వారా దక్షిణాఫ్రికాపై జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ విజయం సాధించి రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్సు 137 పరుగుల తేడాతో విజయం సాధించి, మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. తద్వారా స్వదేశంలో 11 టెస్ట్ సిరీస్ లను వరుసగా గెలుచుకున్న ప్రపంచ రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది.

న్యూఢిల్లీ: కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన డబుల్ సెంచరీ ద్వారా దక్షిణాఫ్రికాపై జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ విజయం సాధించి రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్సు 137 పరుగుల తేడాతో విజయం సాధించి, మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. తద్వారా స్వదేశంలో 11 టెస్ట్ సిరీస్ లను వరుసగా గెలుచుకున్న ప్రపంచ రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది.
undefined
ప్రపంచ కప్ పోటీల నుంచి తప్పుకున్న తర్వాత కూడా విరాట్ కోహ్లీ అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అయితే విరాట్ కోహ్లీని ఏకంగా ఆకాశానికెత్తాడు. పరుగుల యంత్రంగా కోహ్లీని అతను అభివర్ణించాడు. అంతేకాకుండా ప్రపంచంలో అత్యుత్తమ కెప్టెన్ గా కోహ్లీని అభివర్ణిస్తూ మిగతా కెప్టెన్లు కోహ్లీకి మైళ్ల దూరంలో ఉన్నారని అన్నాడు.
undefined
తన యూట్యూబ్ చానెల్ లో షోయబ్ అక్కర్ మాట్లాడుతూ... ప్రపంచ కప్ పోటీల తర్వాత కోహ్లీ ఉత్తుమ కెప్టెన్ గా ముందుకు వస్తాడని తాను ముందే చెప్పానని, ఎందుకంటే తాను చేసిన తప్పులను తెలుసుకుని సరిదిద్దుకుంటున్నాడని అన్నాడు. ప్రపంచంలో ప్రస్తుతం మీడియోకర్ కెప్టెన్లు ఉన్నారని వ్యాఖ్యానించాడు.
undefined
విరాట్ కోహ్లీ, కానే విలియమ్సన్ తప్ప ప్రపంచంలో ప్రస్తుతం సరైన కెప్టెన్లు లేరని అక్తర్ అన్నాడు. విరాట్ కోహ్లీ గురించి తాను ఒక్క విషయం చెప్పదలుచుకున్నానని, కోహ్లీ భయం తెలియని కెప్టెన్ అని ఆయన అన్నాడు. భారత్ ప్రపంచంలో మేటి జట్టు అని ఆయన కొనియాడాడు.
undefined
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ 254 పరుగులు చేశాడు. ఇది టెస్టు మ్యాచుల్లో అతనికి అత్యధిక వ్యక్తిగత స్కోరు. అదే సమయంలో డాన్ బ్రాడ్ మాన్ రికార్డును అతను బద్దలు కొట్టాడు. టెస్టు మ్యాచుల్లో 6,996 పరుగులు చేసి ఆ రికార్డును సృష్టించాడు. ఏడో డబుల్ సెంచరీ సాధించడం ద్వారా సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ లను వెనక్కి నెట్టాడు. 4 విజయాల తర్వాత టెస్టు మ్యాచుల్లో 200 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
undefined
click me!