టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫిక్స్... హైదరాబాద్‌లో మిస్ అయిన మ్యాచ్ యూఏఈలో...

First Published Jul 16, 2021, 4:07 PM IST

భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ క్రేజ్ వేరే రేంజ్‌లో ఉంటుంది. ఆస్ట్రేలియాను ఓడించి, వరల్డ్‌కప్ గెలిచినా ఇవ్వని కిక్కు, పాకిస్తాన్‌ను మట్టికరిపిస్తే కలుగుతుంది భారత అభిమానులు. ఎన్నో ఏళ్లుగా ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిని ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దు కావడంతో ఇండో పాక్ మ్యాచ్ చూసే అవకాశం దొరకలేదు..

2019 వన్డే వరల్డ్‌కప్‌లో చివరిగా తలబడిన భారత్, పాకిస్తాన్‌ జట్లు మరోసారి ఐసీసీ ఈవెంట్‌లోనూ ప్రత్యర్థులుగా తలబడనున్నాయి. 2021 అక్టోబర్ 17 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌కప్‌కి సంబంధించిన గ్రూప్‌లను విడుదల చేసింది ఐసీసీ...
undefined
గ్రూప్ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్, నమీబియా ఉండగా, గ్రూప్ బీలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూ జెనీవా, ఓమన్ జట్లు ఉన్నాయి...
undefined
గ్రూప్ మ్యాచ్‌లో జరిగిన మ్యాచుల్లో గ్రూప్ ఏ, గ్రూప్ బీలో పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన నాలుగు జట్లు సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తారు...
undefined
సూపర్ 12 రౌండ్‌లో గ్రూప్ 1లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. వీటితో పాటు గ్రూప్ ఏలో విన్నర్‌గా నిలిచిన జట్టు, గ్రూప్ బీలో రన్నరప్‌గా నిలిచిన జట్లు సెమీస్ కోసం పోటీపడనున్నాయి.
undefined
గ్రూప్ 2లో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాటు గ్రూప్ ఏలో రన్నరప్‌గా నిలిచిన జట్టు, గ్రూప్ బీలో విన్నర్‌గా నిలిచిన జట్లు ఉన్నాయి...
undefined
గ్రూప్‌లో టాప్ 2లో నిలిచిన రెండేసి జట్లు సెమీ ఫైనల్‌కి అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో విజయం సాధించిన జట్లు నేరుగా ఫైనల్ చేరతాయి...
undefined
గ్రూప్‌లో టాప్ 2లో నిలిచిన రెండేసి జట్లు సెమీ ఫైనల్‌కి అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో విజయం సాధించిన జట్లు నేరుగా ఫైనల్ చేరతాయి...
undefined
యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబిలతో పాటు ఓమన్ వేదికగా టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వహించనుంది బీసీసీఐ. త్వరలోనే అక్కడి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించనుంది ఐసీసీ, బీసీసీఐ టీమ్.
undefined
click me!