భారత జట్టు నెట్ ప్రాక్టీస్ చేస్తున్న దగ్గరికి వందల సంఖ్యలో ఇండియా, పాకిస్తాన్ ఫ్యాన్స్ వచ్చి తమ దేశాలకు సపోర్ట్ చేస్తూ నినాదాలు చేశారు. మరి లక్ష మందితో నిండిపోయే స్టేడియంలో ఈ సారి రిజల్ట్ తేడా కొడితే పరిస్థితి ఏంటి? అంత మంది అభిమానుల ఎమోషన్స్ని, ఆగ్రహాన్ని కంట్రోల్ చేయగలగడం సాధ్యమయ్యే పనేనా... అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆస్ట్రేలియా ఎన్ని ఏర్పాట్లు చేసినా.. అంతమందిని నిలువరించడం అయ్యేపనేనా..!