ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ చేసి ఆకట్టుకుని, 171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులు చేసి అవుట్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్...
అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా వంటి సీనియర్లు త్వరగా అవుట్ కావడంతో 145 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు 300+ స్కోరు చేయడానికి అయ్యర్ ఇన్నింగ్సే కారణం...
ఓవరాల్గా ఆరంగ్రేటం మ్యాచ్లోనే సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్మెన్ కాగా, స్వదేశంలో ఈ ఫీట్ సాధించిన 10వ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్...
1933లో లాలా అమర్నాథ్, తన తొలి టెస్టులో సెంచరీ చేసి... టీమిండియా తరుపున ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్గా నిలిచారు...
1952లో ఎంట్రీ టెస్టులోనే సెంచరీ చేసిన దీపక్ శోధన్, స్వాతంత్య్ర భారతంలో ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా నిలిచాడు.
1955లో ఏజీ కృపిల్ సింగ్, 1959లో అబ్బాస్ ఆలీ, 1964లో హనుమంత్ సింగ్, 1969లో గుండప్ప విశ్వనాథ్, 1976లో సురీందర్ అమర్నాథ్ ఈ ఫీట్ సాధించారు...
1984లో టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అజారుద్దీన్ తొలి మ్యాచ్లోనే సెంచరీ చేయగా, 1992లో ప్రవీణ్ అమ్రే, 1996లో సౌరవ్ గంగూలీ, 2001లో వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఫీట్ సాధించారు...
2000వ సంవత్సరం దాటిన తర్వాత సెహ్వాగ్ ఈ ఫీట్ సాధించిన తొలి భారత బ్యాట్స్మెన్ కాగా, ఆ తర్వాత 2010లో సురేష్ రైనా, 2013లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, 2018లో పృథ్వీషా ఈ ఫీట్ సాధించారు....
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లీగ్లో ఆరంగ్రేటం మ్యాచ్లోనే సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్మెన్గా శ్రేయాస్ అయ్యర్ రికార్డు క్రియేట్ చేశాడు. 2019-21 సీజన్లో భారత బ్యాట్స్మెన్ ఎవ్వరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు...
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ఆరో భారత బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్. 1955లో కృపిల్ సింగ్, 1964లో హనుమంత్ సింగ్, 1984లో మహ్మద్ అజారుద్దీన్, 2001లో వీరేంద్ర సెహ్వాగ్, 2018లో పృథ్వీషా... అయ్యర్ కంటే ముందు ఈ ఫీట్ సాధించారు...
నెం.5లో ఆరంగ్రేటం చేసి, సెంచరీ చేసిన నాలుగో భారత ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. వేరే ఏ ఇతర దేశంలోనూ ముగ్గురూ కూడా ఈ ఫీట్ సాధించలేకపోవడం విశేషం...
కాన్పూర్లోని గ్రీన్ పార్క్లోనే ఆరంగ్రేటం టెస్టులో సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్. 1969లో ఆస్ట్రేలియాపై గుండప్ప విశ్వనాథ్ ఈ ఫీట్ సాధించాడు...