150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై గెలిచన భారత్
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. సూపర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ జట్టు 97 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ జట్టుకు మంచి అరంభం లభించింది కానీ, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ ప్లేయర్లలో ఫిల్ సాల్ట్ ఒక్కడే 55 పరుగులతో హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
భారత్ బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ లోని కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రమే డబుల్ డిజిట్ అందుకోగా, మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. దీంతో భారత జట్టు ఇంగ్లాండ్ పై 150 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ, శివమ్ దుబే లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.