ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కలిపి 14 బౌండరీలు మాత్రమే సాధించాయి. కివీస్ తరఫున ఫిన్ అలెన్ ఒక్కడే రెండు బౌండరీలు కొట్టాడు. డెవాన్ కాన్వే, మిచెల్, శాంట్నర్, డఫ్ఫీ లు తలో బౌండరీ కొట్టారు. భారత్ నుంచి గిల్, ఇషాన్ లు తలా రెండు ఫోర్లు కొట్టగా.. త్రిపాఠి, సూర్య, వాషింగ్టన్ సుందర్, హార్ధిక్ లు చెరో ఫోర్ కొట్టారు.