రోహిత్-గిల్ సెంచరీ భాగస్వామ్యం
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ భారత్కు బలమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 105 పరుగులు జోడించారు. అయితే, శుభ్మన్ గిల్ (31 పరుగులు) అవుట్ అయిన తర్వాత భారత ఇన్నింగ్స్ తడబడింది. రెండు బంతుల్లో 1 పరుగు చేసి విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. దీని తర్వాత కొద్దిసేపటికి రోహిత్ శర్మ కూడా అవుట్ అయ్యాడు.
రోహిత్ 76 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, అందులో హిట్ మ్యాన్ 7 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. వీరు అవుట్ అయిన తర్వాత ఒకానొక సమయంలో ఈ మ్యాచ్లో భారత్ వెనుకబడినట్లు అనిపించింది, కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణించడంతో భారత్ విజయం సాధించింది.