రిషబ్ పంత్, నితీష్ రెడ్డి ఇన్నింగ్స్ లతో 150 కి చేరిన భారత్
కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, జైస్వాల్, పడిక్కల్ ఔట్ అయిన తర్వాత మరో యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ధ్రువ్ జురెల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. అతను 11 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 4 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ కూడా ఔటయ్యాడు. దీంతో భారత్ స్కోరు 73/6 పరుగులు చేరింది. ఇక్కడి నుంచి టీమ్ఇండియా 100 పరుగులకు చేరుకోవడం కష్టమే అనిపించిన సమయంలో రిషబ్ పంత్, నితీష్ లు ఇన్నింగ్స్ ను 150 పరుగులకు తీసుకెళ్లారు. పంత్ 37 పరుగులు, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 8 పరుగులు, హర్షిత్ రాణా 7 పరుగుల, నితీష్ రెడ్డి 41 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, హెజిల్ వుండ్ 4, ప్యాట్ కమ్మిన్స్ 2, మిచెల్ మార్ష్ 2 వికెట్లు తీసుకున్నారు.