INDvsAUS: రహానే కెప్టెన్ ఇన్నింగ్స్... పంత్ రికార్డు పర్ఫామెన్స్... ఆధిక్యం దిశగా టీమిండియా...
First Published Dec 27, 2020, 10:08 AM ISTబాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఆధిక్యం దిశగా సాగుతోంది. టీ విరామానికి 63.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా, 189 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 6 పరుగులు వెనకబడి ఉన్న భారత జట్టు, రవీంద్ర జడేజా, రహానే మరిన్ని పరుగులు జత చేస్తే మంచి ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. కెప్టెన్గా వ్యవహారిస్తున్న అజింకా రహానే హాఫ్ సెంచరీతో క్రీజులో ఉన్నాడు.