రోహిత్ శర్మ చేస్తే రైటు, విరాట్ కోహ్లీ చేస్తే తప్పా... సునీల్ గవాస్కర్‌కి అది ఎక్కువైంది...

First Published Dec 27, 2020, 8:56 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో మధ్యలో విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ సమయంలో తండ్రి అయిన నటరాజన్‌కి ఓ రూల్, విరాట్ కోహ్లీకి ఓ రూల్ ఎలా ఉంటుందని బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు సునీల్ గవాస్కర్. అయితే కోహ్లీపై ఫైర్ అయిన గవాస్కర్‌పై విరుచుకుపడుతున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్.

ఆస్ట్రేలియా పర్యటనలో పెటర్నిటీ లీవ్ తీసుకోవాలని ఐపీఎల్ సమయంలో నిర్ణయించుకున్నాడు భారత సారథి విరాట్ కోహ్లీ...
undefined
కోహ్లీ నిర్ణయం కారణంగా జనవరిలో జరగాల్సిన పింక్ బాల్ టెస్టును, మొదటి టెస్టుకి మార్చింది బీసీసీఐ. లేకపోతే షెడ్యూల్ ప్రకారం సిడ్నీలో మూడో టెస్టు డే నైట్ టెస్టుగా జరగాల్సింది.
undefined
అయితే పెటర్నిటీ లీవ్ తీసుకున్న విరాట్ కోహ్లీపై కొందరు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నటరాజన్ తన బిడ్డను చూసుకునేందుకు రెండు నెలలకు పైగా వేచి ఉంటున్నప్పుడు, విరాట్ కోహ్లీ రెండు వారాలు ఆగలేడా?’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్.
undefined
సునీల్ గవాస్కర్‌పై మండిపడుతున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్... భారత క్రికెటర్ రోహిత్ శర్మ పెటర్నిటీ లీవ్ తీసుకున్నప్పుడు ఏమీ మాట్లాడని గవాస్కర్, ఇప్పుడు కోహ్లీ తీసుకుంటే మాత్రం ఎందుకు తప్పుపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
undefined
2017 సీజన్‌లో బావ మరిది పెళ్లికి హాజరయ్యేందుకు మ్యాచులకు డుమ్మా కొట్టాడు రోహిత్ శర్మ. లీవ్ తీసుకుని మరీ పెళ్లిలో హంగామా చేశాడు...
undefined
ఆ తర్వాత 2018 ఆస్ట్రేలియా టూర్ సమయంలో పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు రోహిత్ శర్మ. గాయంతో 2029లో న్యూజిలాండ్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు.
undefined
ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మ, రెస్టు తీసుకోవాలని ఫిజియో సూచించినా మళ్లీ బరిలో దిగి గాయాన్ని తీవ్రతరం చేసుకున్నాడు. ఫలితంగా వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు.
undefined
టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లకుండా... స్వదేశానికి వచ్చి మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు రోహిత్ శర్మ.. బీసీసీఐలో A+ కాంట్రాక్ట్‌లో ఉన్న ఓ స్టార్ క్రికెటర్ ఇలా చేస్తుంటే సునీల్ గవాస్కర్‌కి తప్పుగా అనిపించడం లేదని, విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకుంటే మాత్రం తప్పని వాదిస్తున్నారని నిలదీస్తున్నారు విరాట్ ఫ్యాన్స్.
undefined
రోహిత్ శర్మ ముంబై వాడు కావడం వల్లే, సునీల్ గవాస్కర్ అతని గురించి మాట్లాడడం లేదని... విరాట్ గురించి మాత్రం ద్వంద్వ నీతి అంటూ మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్...
undefined
సునీల్ గవాస్కర్ ఇప్పటికైనా ముంబైవాలా బంధు ప్రీతి బయటికి రావాలని, ఇప్పటికే ఆయనలో అది బాగా పెరిగిపోయిందని ట్రోల్ చేస్తున్నారు కోహ్లీ అభిమానులు.
undefined
ఐపీఎల్ సమయంలో విరాట్ కోహ్లీ ఫామ్‌తో అనుష్క శర్మను లింక్ పెడుతూ సునీల్ గవాస్కర్ చేసిన వ్యంగ్య కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. ‘లాక్ డౌన్ టైంలో అనుష్కతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇక్కడ సరిపోదు’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్. ఈ కామెంట్లపై అనుష్క కూడా అసహనం వ్యక్తం చేసింది.
undefined
click me!