మాలో ఒక్కరిని టార్గెట్ చేస్తే, మేమంతా మీద పడిపోతాం జాగ్రత్త.... కెఎల్ రాహుల్ స్వీట్ వార్నింగ్...

First Published Aug 17, 2021, 11:38 AM IST

కసిగా రెచ్చిపోయారు... లార్డ్స్‌ టెస్టులో టీమిండియా ప్రదర్శన చూసినవారికెవ్వరైనా ముందుగా గుర్తొచ్చేది ఇదే. జస్ప్రిత్ బుమ్రాను టార్గెట్ చేస్తూ జేమ్స్ అండర్సన్ వ్యాఖ్యల నుంచి టీమిండియా ఆటతీరు పూర్తిగా మారిపోయింది...

ఆ కామెంట్లను కూడా లైట్‌గా తీసుకున్న టీమిండియా... బుమ్రా బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో అతన్ని టార్గెట్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లు వేసిన బౌన్సర్లు... భారత జట్టును రెచ్చగొట్టాయి...

ఈ సంఘటనల తర్వాత మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా రెచ్చిపోయి స్టార్ బ్యాట్స్‌మెన్‌ల రేంజ్‌లో బ్యాటింగ్ అదరగొట్టారు. ఓ వన్డే మ్యాచ్ ఆడుతున్న రీతిలో బౌండరీల మోత మోగిస్తుంటే... 600+ టెస్టు వికెట్లు తీసిన అండర్సన్ కూడా ఏమీ చేయలేకపోయాడు. 

ఆ తర్వాత బౌలింగ్‌లోనూ అదే రేంజ్‌ కసిని కనబర్చిన టీమిండియా బౌలర్లు... మొదటి ఓవర్‌ నుంచే వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌ను తీవ్ర ఒత్తిడిలో పడేశారు. ఈ విజయం తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కెఎల్ రాహుల్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది...

ఈ సమయంలో కెఎల్ రాహుల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాల తెగ వైరల్ అవుతున్నాయి... ‘మీరు మాలో ఒక్కరిని టార్గెట్ చేస్తే, మేమంతా కలిసి మీద పడిపోతాం... 

రెండు పటిష్టమైన జట్ల మధ్య మ్యాచ్ ఎలా సాగితేనే, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. గ్రేట్ స్కిల్స్‌తో పాటు మనసు కూడా పెడతాం. అందుకే కొన్ని మాటలు కూడా ఇచ్చిపుచ్చుకుంటాం...

క్రికెట్‌లో చిన్నచిన్న గొడవలు చాలా సహజం. అయితే మీరు మాలో ఒక్కరిని టార్గెట్ చేస్తే, మేం 11 మందిని అతని వెనకాలే ఉంటాం... ’ అంటూ కామెంట్ చేశాడు కెఎల్ రాహుల్...

click me!