ఇక రాంచీ మ్యాచ్ లో ధోనిని మిస్ అవుతున్నారా..? అని అడిగిన ప్రశ్నకు శార్దూల్ సమాధానం చెబుతూ.. ‘అవును. ధోనిని అందరూ మిస్ అవుతున్నారు. ఎందుకంటే అతడికున్న అపారమైన అనుభవం మా అందరికీ చాలా ముఖ్యం. భారత్ కు 300 కంటే ఎక్కువ వన్డేలు, 90 ప్లస్ టెస్టులు ఆడిన ధోని వంటి అనుభవజ్ఞుడిని తప్పకుండా మిస్ అవుతాం. ఇలాంటి ఆటడాడు దొరకడం చాలా అరుదు..’ అని చెప్పాడు.