261 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. పాక్ తో మ్యాచులో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ స్మృతి మంధాన (5), దీప్తి శర్మ (5) లుు ఈ మ్యాచులో విఫలమయ్యారు. హర్మన్ ప్రీత్ కౌర్ (71), కెప్టెన్ మిథాలీ రాజ్ (31) పోరాడినా.. ఫలితం మాత్రం దక్కలేదు. 46.4 ఓవర్లలో భారత్ .. 198 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా కివీస్ 62 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.