ఈనెల మూడో వారం నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కాబోయే టీ20 ప్రపంచకప్ లో పాల్గొనబోయే జట్లు ఇప్పటికే 15 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, స్టాండ్ బై లతో కూడిన జట్లను ఎంపిక చేశాయి. అయితే ఆయా జట్లలో గాయపడిన ఆటగాళ్ల స్థానంలో కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడానికి, జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి బోర్డులకు నేడే ఆఖరి రోజు.