2024 ఐసీసీ టెస్ట్ జట్టు: రోహిత్, కోహ్లీలు కాదు.. ముగ్గురు భారతీయులకు చోటు

Published : Jan 24, 2025, 10:52 PM ISTUpdated : Jan 24, 2025, 10:58 PM IST

ICC 2024 Test Team of the Year: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2024లో అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేసింది. భారత్ ప్రస్తుత జట్టులో ఇద్దరు విజయవంతమైన స్టార్ల‌కు చోటు ద‌క్క‌లేదు. ఆస్ట్రేలియన్ పాట్ కమిన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

PREV
15
2024 ఐసీసీ టెస్ట్ జట్టు: రోహిత్, కోహ్లీలు కాదు.. ముగ్గురు భారతీయులకు చోటు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2024 సంవత్సరపు టెస్ట్ మ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్ల ఆధారంగా ఐసీసీ పురుషుల టెస్ట్ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

ఈ జాబితాలో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించినప్పటికీ, గత ఏడాది 10 టెస్ట్ మ్యాచ్‌లలో 24.52 సగటుతో కేవలం 417 పరుగులు మాత్రమే కోహ్లీ సాధించారు. అలాగే, భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. దీంతో అతనికి కూడా ఐసీసీ 2024 టెస్టు జట్టులో చోటుదక్కలేదు.  

25

గత ఏడాది 14 టెస్ట్ మ్యాచ్‌లలో 24.76 సగటుతో 619 పరుగులు చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియా సిరీస్‌లో 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశారు. ఈ దారుణ ప్రదర్శన కారణంగా రోహిత్, కోహ్లీ ఇద్దరికీ చోటు దక్కలేదు.

ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం

భారత ఫాస్ట్ బౌలింగ్ అటాక్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా, సీనియర్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 2024 సంవత్సరానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఉత్తమ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన నలుగురు ఆటగాళ్లతో పాటు, వెటరన్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్‌తో సహా న్యూజిలాండ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఈ ఐసిసి ఆల్ స్టార్ జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమిన్స్‌కు ఈ జట్టు కెప్టెన్సీకి ఎంపికయ్యాడు.

ఆసీస్ స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ వరుసగా రెండో ఏడాది ఐసీసీ పురుషుల టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. భారత్ నుండి యశస్వి జైస్వాల్ ఈ ఏడాది 54.74 సగటుతో 1,478 పరుగులు సాధించి జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. దీంతో ఆయనకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది.

35
జస్ప్రీత్ బుమ్రా

జస్ప్రీత్ బుమ్రా 

జస్ప్రీత్ బుమ్రా 2024లో 14.92 సగటుతో 71 వికెట్లు తీసి వికెట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. దీంతో ఆయన ఐసీసీ టెస్ట్ జట్టులో చోటు సంపాదించారు. అలాగే,  జడేజా కూడా గత ఏడాది టెస్ట్‌లలో 527 పరుగులు, 48 వికెట్లు తీయడంతో ఆయనకూ ఐసీసీ జట్టులో చోటు దక్కింది. 

ఇంగ్లండ్ నుండి టాప్ 4 ఆటగాళ్ళు

ఐసీసీ 2024 టెస్టు జ‌ట్టులో ఇంగ్లండ్ నుంచి గరిష్టంగా నలుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జామీ స్మిత్‌లతో పాటు ఇంగ్లండ్‌లో అత్యధిక టెస్ట్ స్కోరర్ జో రూట్ జట్టులో ఉన్నారు. హ్యారీ బ్రూక్ 2024లో అద్భుతమైన ఫామ్‌ను కొన‌సాగించాడు. పాకిస్థాన్‌పై ట్రిపుల్ సెంచరీ కూడా సాధించిన సంగ‌తి తెలిసిందే.

45
Kane Williamson

ఇంగ్లండ్‌కు చెందిన నలుగురు ఆటగాళ్లతో పాటు, వెటరన్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్‌తో సహా న్యూజిలాండ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. కేన్ విలియమ్సన్, మాట్ హెన్రీ న్యూజిలాండ్‌కు ఇద్దరు ఆటగాళ్లు. ఐసీసీ టెస్టు జట్టులో శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ కూడా చోటు దక్కించుకున్నాడు. 

55

2024 సంవత్సరానికి ICC అత్యుత్తమ టెస్టు జట్టు: 

ప్యాట్ కమిన్స్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), యశస్వి జైస్వాల్ (భారత్), బెన్ డకెట్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), జో రూట్ (ఇంగ్లండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్ (శ్రీలంక), జామీ స్మిత్ (వికెట్ కీపర్ ఇంగ్లండ్), రవీంద్ర జడేజా (భారతదేశం), మాట్ హెన్రీ (న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా (భారతదేశం).

 

Read more Photos on
click me!

Recommended Stories