రోహత్ శర్మ గైర్హాజరీలో రాహుల్ కు గానీ ధావన్ కు గానీ కెప్టెన్సీ ఇస్తే వైస్ కెప్టెన్ గా రిషభ్ పంత్ ను నియమించేవారు సెలక్టర్లు. కానీ బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో మాత్రం అలా జరుగలేదు. పంత్ ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. దీంతో రిషభ్ పంత్ ను బీసీసీఐ సైడ్ చేస్తుందనే వాదనలు మొదలయ్యాయి.