ఆటపరంగా గాక తన ప్రవర్తనతో ఐపీఎల్ లో అభిమానులకు గుర్తున్న ఆటగాళ్లలో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియన్ పరాగ్ ఒకడు. ఈ అసోం కుర్రాడు.. ఐపీఎల్-15లో ఆర్సీబీతో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు అదే మ్యాచ్ లో హర్షల్ పటేల్ తో గొడవపడి అందరి నోళ్లలో నానాడు. ఆ తర్వాత అశ్విన్ తో పాటు మరికొందరు సహచర ఆటగాళ్లతో కూడా అతి చేసి విమర్శల పాలయ్యాడు.