టీమిండియా తాజా మాజీ సారథులు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు గత కొంతకాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఐపీఎల్ లో ఈ ఇద్దరి ఆటతీరు విమర్శల పాలైంది. భారత జట్టు రాబోయే రోజుల్లో కీలక సిరీస్ లతో పాటు టీ20 ప్రపంచకప్ - 2022 ఆడనున్న నేపథ్యంలో ఈ ఇద్దరి ఫామ్ చర్చనీయాంశమైంది.