ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్ లో ఏదీ కలిసిరావడం లేదు. వరుసగా ఏడు మ్యాచులు ఓడిన ఆ జట్టు వైఫల్యాల కంటే ఆటగాళ్ల ఆటతీరు అభిమానులను ఎక్కువగా బాధిస్తున్నది. ముఖ్యంగా కోట్లకు కోట్లు పోసి దక్కించుకున్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్ ల వైఫల్యం ముంబై అభిమానులకు మింగుడుపడటం లేదు.