2008 నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ వేలానికి వెళ్లి ఉంటే సంచలనం సృష్టించేవాడు. అయితే, అతను ఎప్పుడూ వేలానికి వెళ్లలేదు. అయినప్పటికీ, విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి 17 సంవత్సరాల్లో మొత్తం ₹173.2 కోట్లు సంపాదించాడు. 252 మ్యాచ్లలో, విరాట్ కోహ్లీ 55 అర్ధ సెంచరీలు, 8 సెంచరీలతో సహా 8,004 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 113 పరుగులు.
విరాట్ కోహ్లీ నికర విలువ ₹1,050 కోట్లుగా అంచనా. అధిక సంపాదన ఉన్నప్పటికీ, విరాట్ కోహ్లీ 17 సంవత్సరాల్లో ఐపీఎల్ నుండి ₹173.2 కోట్లు మాత్రమే సంపాదించాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి కింగ్ కోహ్లీ వేలానికి వెళ్లలేదు. ఆర్సీబీ జట్టు తరఫున మాత్రమే ఆడుతున్నాడు.
ఒకవేళ కోహ్లీ వేలానికి వెళ్లివుంటే అతని సంపాదన చాలా ఎక్కువగా ఉండేది. మొత్తానికి ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సంపాదించిన భారతీయ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో ధోని, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరి తర్వాత సురేష్ రైనా, రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, ఏమీ డివిలియర్స్ ఉన్నారు.