ఈ మ్యాచ్ లో కోహ్లీ.. 82 పరుగులు చేయడం ద్వారా రోహిత్ శర్మ రికార్డును కూడా బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్ లో అతడు 82 పరుగులు చేయడంతో ఈ ఫార్మాట్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మ (3,741) ను అధిగమించాడు. రోహిత్.. ఈ ఘనతను 143 మ్యాచ్ లలో అందుకోగా కోహ్లీ.. 110 మ్యాచ్ లలోనే సాధించాడు.