ఈ మ్యాచ్ లో పాండ్యా వ్యవహరించిన తీరు, మ్యాచ్ ప్రణాళికలు కూడా విమర్శలకు తావిచ్చాయి. తానే తొలి ఓవర్ వేయడం, పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నా పేసర్లకు బంతినిచ్చి కివీస్ భారీ పరుగులు చేసేలా అవకాశాలు కల్పించడం, టీ20లో మంచి రికార్డు ఉన్న పృథ్వీ షాను కాదని అంత గొప్ప రికార్డు లేని గిల్ ను ఆడించడం వంటివి విమర్శలకు దారితీశాయి.