పదే పదే విఫలమవుతున్నా రిషభ్ పంత్ కు అవకాశాలివ్వడం, వచ్చే ప్రపంచకప్ లో ఆడతాడో లేదో తెలియని భువనేశ్వర్ ను ఆడించడం, రాణించకున్నా పలువురిని జట్టులో భారంగా కొనసాగించడం వంటివి టీమిండియాను పట్టిపీడిస్తున్నాయి. మరీ ముఖ్యంగా టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్ కు జట్టులో చోటివ్వకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.