అయితే భువీ కంటే పాండ్యా ను ఎంపిక చేసిందే బెటరనే భావనలో సెలెక్టర్లు ఉన్నారు. ఐపీఎల్-15లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ను అద్భుతంగా నడిపించిన పాండ్యా.. ఆ జట్టును ఫైనల్ కు చేర్చాడు. బ్యాటర్ గా తాను కూడా గతంలో కంటే మెరుగయ్యాడు. ఈ సీజన్ లో అతడు 14 మ్యాచులాడి 45.30 సగటుతో 453 పరుగులు చేశాడు.