కరోనా బాధితుల కోసం తెలుగు క్రికెటర్ హనుమ విహారి సాయం... 100 మంది వలంటీర్లతో కలిసి...

First Published May 16, 2021, 12:36 PM IST

దేశంలో కరోనా సెకండ్ వేవ్‌తో పడరాని కష్టాలు పడుతున్న బాధితుల సహాయార్థం తెలుగు క్రికెటర్ హనుమ విహారి నడుం బిగించాడు. తన కుటుంబం, స్నేహితులు, ఆత్మీయులతో కలిసి 100 మందితో ఓ వలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేసి, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న తెలుగు క్రికెటర్, టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ హనుమ విహారి... తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న 100 మంది వలంటీర్లతో ఓ బృందాన్ని వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి... కరోనా బాధితుల కోసం సహాయక చర్యలు ప్రారంభించాడు.
undefined
ఈ టీమ్‌లో హనుమ విహారి భార్య ప్రీతితో పాటు ఆయన చెల్లెలు వైష్ణవి, ఆంధ్ర జట్టు రంజీ ప్లేయర్లు కూడా ఉన్నారు. వీరంతా కలిసి సోషల్ మీడియా ద్వారా కరోనాతో బాధపడుతున్న ఆసుపత్రుల్లో బెడ్‌లు దొరకక, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక, సమయానికి మందులు అందక ఇబ్బంది పడుతున్న వివరాలు సేకరిస్తున్నారు.
undefined
హనుమ విహారి వలంటీర్లు వివిధ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్‌ల వివరాలు సేకరించి, కరోనా పేషెంట్లకు సమాచారం ఇవ్వడమే కాకుండా వారికి అవసరమైన సాయం చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు...
undefined
‘సోషల్ మీడియాలో నాకున్న ఫాలోవర్లను ఈ పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవచ్చని ఆలోచించా. నెమ్మదిగా ప్రారంభమైన ఈ ఆలోచన, సాధ్యమైనంతమందికి సాయం చేసేందుకు ఉపయోగపడుతోంది. ఇప్పుడు చాలామందికి చాలా అవసరాలు ఉన్నాయని తెలిసింది...
undefined
ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా దాదాపు 100 మంది వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. మేం కరోనాతో ఇబ్బందిపడుతున్న వివరాలు తెలుసుకుని, వారి ప్రతీ అవసరాన్ని తీర్చే ప్రయత్నం చస్తున్నాం. ఒకవేళ మా వల్ల కాకపోతే, సోషల్ మీడియా ద్వారా వారికి సాయపడే వ్యక్తులకు సమాచారాన్ని అందిస్తున్నాం...
undefined
ఓ వైపు కౌంటీ మ్యాచులు ఆడుతూనే, మరోవైపు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నా. వర్క్ విషయంలో నేను పూర్తి కమిట్‌మెంట్ చూపిస్తా. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సాధ్యమైనంత ప్రాక్టీస్ చేస్తున్నా... ’ అంటూ తెలిపాడు హనుమ విహారి.
undefined
కరోనా బాధితుల కోసం హనుమ విహారి చేస్తున్న సహాయ కార్యక్రమల గురించి తెలుసుకున్న మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.
undefined
‘100మందితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, కరోనా బాధితుల కోసం హనుమ విహారి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నా. నేను ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నా, అయినా నా బాధ్యతగా ఓ సంస్థకు ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నా. ఏదైనా సాయం కావాలంటే, చేయడానికి సిద్ధంగా ఉన్నానని విహారికి చెప్పాను...’ అంటూ తెలిపాడు లక్ష్మీపతి బాలాజీ.
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌ మధ్యలో సీఎస్‌కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. బాలాజీతో పాటు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్, బస్ క్లీనర్ కరోనా బారిన పడి కోలుకున్నారు.ఆ తర్వాత సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హుస్సీ కూడా కరోనా పాజిటివ్‌గా తేలి, కోలుకున్నాడు.
undefined
click me!