18వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదిన మాథ్యూ వేడ్, భువనేశ్వర్ కుమార్ వేసిన 19వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాది మ్యాచ్ని వన్సైడ్ చేసేశాడు. 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసిన మాథ్యూ వేడ్, అజేయంగా నిలిచి మ్యాచ్ని ముగించాడు.