అలా టీమిండియాకి దూరమైన పృథ్వీ షా... గబ్బాలో జరిగిన టెస్టు మ్యాచ్కి ముందు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి, కెఎల్ రాహుల్.. ఇలా అరడజనుకి పైగా ప్లేయర్లు గాయపడినా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మయాంక్ అగర్వాల్ని మిడిల్ ఆర్డర్లో ఆడించిన టీమిండియా, యంగ్ ప్లేయర్ శుబ్మన్ గిల్ని రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయించింది. గిల్ సక్సెస్, పృథ్వీ షాని టీమిండియాలోకి రాకుండా గేట్లు మూసేసినట్టైంది...