యాక్టివ్ ప్లేయర్లో ఒకరు మాత్రమే ఉన్నారు
టెస్టు మ్యాచ్లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఒకే ఒక్క ప్లేయర్ ఉన్నారు. అతనే ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషాగ్నే. ఆస్ట్రేలియాకు చెందిన ఈ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ 2022లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో 204 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు.
వీరితో పాటు, లారెన్స్ రోవ్ (వర్సెస్ న్యూజిలాండ్ - 214, 100*), గ్రెగ్ చాపెల్ (వర్సెస్ న్యూజిలాండ్ - 247*, 133), గ్రాహం గూచ్ (వర్సెస్ ఇండియా - 333, 123), బ్రియాన్ లారా (వర్సెస్ శ్రీలంక - 221, 130), కుమార్ సంగక్కర (వర్సెస్ బంగ్లాదేశ్ - 319, 105) కూడా ఒకే టెస్టు మ్యాచ్ లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన వారి లిస్టులో ఉన్నారు.