వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్... ఆ సెన్సేషనల్ ప్లేయర్‌కి ఛాన్స్...

First Published Mar 22, 2021, 11:44 AM IST

ఇప్పటికే టీమిండియాతో జరిగిన టెస్టు, టీ20 సిరీస్‌లను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు, 23 నుంచి ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు పటిష్ట జట్టుతో బరిలో దిగబోతోంది... ఈ 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్.

బిగ్‌బాష్ లీగ్‌ 2020 సీజన్‌‌లో అద్భుతంగా రాణించిన లియామ్ లివింగ్‌స్టోన్‌‌కి వన్డే సిరీస్ జట్టులో చోటు దక్కింది. 2017లో టీ20 జట్టుకి లివింగ్‌స్టోన్, వన్డేల్లో ఆరంగ్రేటం చేయబోతున్నాడు.
undefined
జానీ బెయిర్ స్టో, జాసన్ రాయ్, సామ్ బిల్లింగ్స్, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్, మోయిన్ ఆలీ, సామ్ కుర్రాన్... ఇలా ఆల్‌రౌండర్లు, భారీ హిట్టర్లకు వన్డే సిరీస్‌లో చోటు దక్కింది...
undefined
వీరితో పాటు టామ్ కుర్రాన్, రీస్ తోప్లే, అదిల్ రషీద్, మాట్ పార్కింన్సన్, మార్క్ వుడ్‌ బౌలింగ్ విభాగాన్ని మోయనున్నారు..
undefined
వీరితో పాటు డేవిడ్ మలాన్, క్రిస్ జోర్డాన్, జేక్ బాల్‌‌లను కవర్ ప్లేయర్లుగా వన్డే సిరీస్‌కి ఎంపిక చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు...
undefined
స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో బాధపడుతున్న కారణంగా అతనికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కలిగించింది ఇంగ్లాండ్. ఇప్పటికే స్వదేశం చేరుకున్న ఆర్చర్ ఐపీఎల్ ఆడడం కూడా అనుమానమే...
undefined
ఐపీఎల్ తర్వాత ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌ల కోసం ఆర్చర్‌ను రెఢీగా ఉంచేందుకు అతనికి విశ్రాంతి కల్పించాలని భావిస్తోంది ఇంగ్లాండ్. అయితే అతను ఐపీఎల్ ఆడతాడా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు.
undefined
అలాగే టెస్టు కెప్టెన్ జో రూట్‌కు కూడా వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న జో రూట్, టీ20 సిరీస్ ఆడలేదు. రొటేషన్ ఫార్ములా కారణంగా వన్డే సిరీస్‌లోనూ అతనికి చోటు దక్కలేదు...
undefined
టీమిండియాలో టెస్టు సిరీస్‌లో భాగమైన చాలామంది ప్లేయర్లు టీ20 సిరీస్ ఆడారు, వన్డే సిరీస్ ఆడబోతున్నారు. అయితే ఇంగ్లాండ్‌లో ఒక్క బెన్ స్టోక్స్ ఒక్కడే మూడు ఫార్మాట్లు పూర్తిగా ఆడబోతున్నాడు.
undefined
click me!