2018లో సౌతాఫ్రికాతో టెస్టు సందర్భంగా అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తో పాటు మరో ఆటగాడు బాల్ టాంపరింగ్ కు పాల్పడటంతో క్రికెట్ ఆస్ట్రేలియా వారిపై ఏడాది నిషేధం విధించింది. స్మిత్, వార్నర్ పై కెప్టెన్సీ నిషేధం కూడా వేసింది. కానీ రెండేండ్ల క్రితమే స్మిత్ పై ఈ నిషేధం ఎత్తేసింది. అంతేగాక అతడిని టెస్టులకు కమిన్స్ కు డిప్యూటీగా నియమించింది. భారత్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో స్మిత్ సారథిగా కూడా వ్యవహరించాడు.