ఈ లక్ష్యఛేదనలో వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ కాగా, సచిన్ టెండూల్కర్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్కి 83 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 35 పరుగులు చేసిన కోహ్లీ అవుట్ కాగా ధోనీ, ఐదో స్థానంలో బ్యాటింగ్కి రావడం ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలింది..